Some Interesting Facts About Sr.NTR | WebyPost
Telugu Native
Telugu Native
Dec 10, 2020 Public

Some Interesting Facts About Sr.NTR

Some Interesting Facts About Sr.NTR
NTR గారు స్తాపించిన తెలుగు దేశం పార్టీ బతికి ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థమైన నాయకత్వం వలన, లేందంటే మరో ప్రజారాజ్యం లాగ, తమిళనాడులో MGR స్తాపించిన ADMK లాగ, కర్ణాటక లో రామకృష్ణ హేగ్డే స్తాపించిన జనతా పార్టీ లాగ కనుమరుగయ్యేది.

NTR గారి వీరాభిమానిగ తెలుగుజాతి ఆత్మ గౌరవం కోసం స్తాపించిన తెలుగుదేశం పార్టి ఈ జాతి భుామండలం మీద ఉన్నంత కాలం భ్రతికుండాలని కోరుకొనె మెుదటి వ్యక్తిని నేను.

నేను 5 వ తరగతి చదువు కొంటున్న రోజుల్లో కొండవీటి సింహం విడుదల కావడం, అనుకోకుండా నేనా చిత్రం చుాడడం, NTR గారి అభిమానిగ మారడం చకచకా జరిగి పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నా అభిమాన నటుడు NTR గారే. విడుదలైన తొలి నాళ్ళలోనే బొబ్బిలి పులి చిత్రాన్ని 20 సార్లు చుాశాను.

NTR గారిని 1985 సంవత్సరంలో ప్రత్యక్షంగా చుాశాను. ఆప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవినుండి బర్తరఫ్ అయినందున చైతన్య రతం పై మాఊరు వచ్చారు.

నాదేళ్ళ బాస్కర్ రావును ముఖ్య మంత్రి పదవినుంచి దించి, మళ్ళీ NTR గారిని ముఖ్యమంత్రిగా చెయ్యడం కోసం పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్న రోజులవి.

తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్తాపించి, తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను దేశ వ్యాప్తం చేసిన గనుడు అన్న NTR గారు.

అలాంటి గొప్ప వ్యక్తి జీవతంలోకి మీ అభిమానినని, మీ జీవిత చరిత్ర రాస్తానని నమ్మపలికి, చేరువై, సాహదర్మచారిణిగ స్తిర పడి పోవడమే కాక, రాష్ట్రం మెుత్తాని కబళించేందుకు ప్రయత్నించిన ఒక దుష్ట శక్తిని నిలువరించటం కోసం చంద్రబాబు గారు ఆరోజున ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరిగింది.

అదికుాడ మెజారిటీ శాసనసభ్యుల అభీష్టం మేర, ప్రజాస్వామ బద్దంగా, నందముారి కుటుంబ సబ్యులందరి అంగీకారంతో హరిక్రిష్ణ, బాలక్రిష్ణ తొ సహ, మరియు దగ్గుపాటి కుటుంబం సబ్యుల అంగీకారం తో సహ, రాష్ట్రం బాగుకోసం, రాష్ట్ర ప్రజల మేలు కోసం అయిష్టంగానే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరిగింది.

రాష్ట్ర ప్రజల మద్దతు కుాడ చంద్రబాబు వైపే ఉండడంతొ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రిగ కొనసాగారు చంద్రబాబు గారు. రెండవ పర్యాయము కుాడ ప్రజలు అఖండమైన మెజారిటీతో గెలిపించారు.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్టానికి 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగ సేవలందించారు చంద్రబాబు గారు. ఎన్నో అభివృద్ధి పనులు, మరెన్నో సంస్కరణలకు నాంది పలకారు.

విజన్ 2020ని శ్రుష్టించి రాష్ట్రాబివ్రుద్దిని పరిగెత్తించారు. హైద్రాబాద్ అనే సాదారణ నగరాన్ని ప్రపంచ నగరంగ అభివృద్ధి చేసి తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజెప్పిన మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.

ఇప్పుడు రాజధాని లేకుండ 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఏర్పటైన ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం,
68 ఏళ్ళ వయస్సులో రోజుకు 18 గంటలు శ్రమిస్తున్న అలుపెరగని శ్రామికుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.

ఉడత బక్తిగా అందరం ఆయన శ్రమలో భాగస్వాములము అవుదాం!

రాజధాని అమరావతి నిర్మాణ చరిత్రలో మనకు కొన్ని పేజీలు కల్పించుకుందాం!!

పోలవరాన్ని పుార్తి చేసుకొని స్వర్ణాంద్ర సాదిద్దాం. !!!

తెలుగు జాతి కీర్తి ప్రతిష్టతను ప్రపంచం ఆగ్రబాగాన నిలుపుదాం.

జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.

No comments yet — be the first!